రాంచీ : ఓ యువతి తన ప్రియుడితో లేచిపోయినందుకు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నలుపు రంగు పూశారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్లోని పాలము జిల్లాలోని సెమ్రా పంచాయతీలో చోటు చేసుకుంది.
నెల రోజుల క్రితం పనేరిబంద్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆ యువతి వెళ్లి వివాహం చేసుకుంది. ఆదివారం రోజు వివాహితను ఆమె కుటుంబ సభ్యులు గుర్తించి సొంతూరుకు తీసుకొచ్చారు. గ్రామ పెద్దలంతా కలిసి ఆమెకు కఠిన శిక్ష విధించారు. బలవంతంగా గుండు గీయించారు. ముఖానికి నలుపు రంగు పూశారు.
ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్స్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఈ ఘటనపై పాలము జిల్లా ఎస్పీ సంజీవ్ కుమార్ స్పందించారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో బాధితురాలి భర్త కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..