రాంచీ: గర్భందాల్చిన బాలికను ఆమె ప్రియుడు హత్య చేసి స్నేహితుడి సహాయంతో పూడ్చిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొరియాదిహ్ గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలిక, 18 ఏండ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఆ బాలిక ప్రెగ్నెంట్ కావడంతో పెండ్లి చేసుకోవాలని ఆ యువకుడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె ప్రియుడు అబార్షన్ కోసం ఒక నర్సును సంప్రదించగా పది వేలు అడిగింది.
అంత డబ్బు లేకపోవడంతో ప్రియురాలిని హత్య చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 21న ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం స్నేహితుడి సహాయంతో ఆమె మృతదేహాన్ని సోన్ నది తీరంలో పూడ్చిపెట్టాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫిబ్రవరి 27న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ప్రియుడితోపాటు సహకరించిన స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.