శ్రీనగర్: జైష్ ఏ మహమ్మద్ కమాండర్ సజ్జాద్ అప్ఘానీ హతమయ్యాడు. ఇవాళ జమ్ముకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ సజ్జాద్ అఫ్ఘానీ హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కొత్తగా యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదంలోకి దించడంలో అఫ్ఘానీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నదని వారు తెలిపారు.
ఎన్కౌంటర్లో సజ్జాద్ అప్ఘానీతోపాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఘటనా స్థలంలో భద్రతాబలగాలకు ఒక ఏకే 47 రైఫిల్తోపాటు యూబీఎల్ షెల్, ఒకటి అమెరికాలో తయారైన రైఫిల్కు సంబంధించిన ఎమ్-4 కార్బైన్ లభ్యమయ్యాయి. సోపియాన్లోని ఓ ప్రదేశంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాబలగాలు స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ముష్కరులు హతమయ్యారు.