హైదరాబాద్, ఫిబ్రవరి 18 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోకర్ పనులు చేసే రేవంత్రెడ్డి ఊసరవెల్లి గురించి మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంగీలు, లాగులు మార్చినట్టు పార్టీలను మార్చే రేవంత్రెడ్డి తొలుత బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి, ఆ తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేశాడని విమర్శించారు. చంద్రబాబు కండ్లలో ఆనందాన్ని చూసేందుకు సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకొన్న రేవంత్రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడంతో గాంధీభవన్ బ్రాందీభవన్ అయిందని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును నిరుద్యోగ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన రేవంత్రెడ్డి శునకం లాంటోడని, ఆయన జన్మదినాన్ని నేరస్తుల దినంగా పాటిస్తామని పేర్కొన్నారు. పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మింగేస్తాడని తెలిపారు. రేవంత్ వచ్చాక తిట్టుకోవడం, నెట్టుకోవడం, కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్లో ఏమున్నదని ఏద్దేవా చేశారు. పట్టపగలే పట్టుబడ్డ గజదొంగ, దొంగలకు సద్దులు కట్టే లఫంగ, క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ రేవంతేనని మండిపడ్డారు. బ్లాక్మెయిలింగ్ను వృత్తిగా, మనీ గెయినింగ్ను ప్రవృత్తిగా పెట్టుకొన్న రేవంత్కు సీఎం కేసీఆర్ ఎడమకాలి చెప్పును తాకే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్ను తిడితే ఎవరినైనా ఉరికిచ్చి కొడతామని జీవన్రెడ్డి హెచ్చరించారు.