న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్-2 ఫలితాలు ఈ నెల 7న వెలువడే అవకాశం ఉన్నది. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్షకు సంబంధించిన ప్రాథిమిక కీని ఎన్టీఏ గురువారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 వరకు వెల్లడించవచ్చని తెలిపింది. దీనికోసం అభ్యర్థులు ప్రతిప్రశ్నకు రూ.200 చెల్సించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షను జులై 25 నుంచి 31 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. విద్యార్థులు ప్రొవిజనల్ కీని jeemain.nta.nic.in వెబ్సైట్ దర్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.