సిద్దిపేట : కారును జేసీబీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కొండపాక శివారులో శుక్రవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఒకే కుటుంబానికి చెందిన వారంతా నిజామాబాద్ నుంచి కొమురవెల్లి దేవస్థానానికి కారులో వెళ్తున్నారు.రాజీవ్ రహదారి కొండపాక శివారులోకి చేరుకోగానే జేసీబీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న పద్మ, మౌనిక, సాయిచరణ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి సిద్దిపేట దవాఖానలో చేర్పించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్