Jaya hey 2.0 | ‘జన గణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాత’.. ఈ గేయం మనకందరికీ తెలిసిందే. పాడగలం కూడా. అయితే, ప్రస్తుతం మనమంతా ఈ గేయంలోని ఒక చరణం మాత్రమే పాడుతున్నాం. ఈ 52 సెకండ్ల నిడివి గల ఈ గేయం ఒక చరణం కాదని… ఈ గేయంలో ఐదు చరణాలు ఉంటాయని మనలో ఎంత మందికి తెలుసు. దేశ స్వాతంత్య్ర దినం వజ్రోత్సవం వేళ ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా అంబుజా నెవాటియా గ్రూప్ చిరు ప్రయత్నం చేసింది. జయ హే 2.0 పేరుతో వీడియోను తీసుకొచ్చారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఈ గేయాన్ని 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది కళాకారులు ఆలపించి ఆకట్టుకున్నారు. గురుదేవ్ రవీంద్రుడి 150 వ జయంతి సందర్భంగా ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలతో వీడియో తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని అంబుజా నెవాటియా గ్రూప్ చైర్మన్ హర్ష్వర్దన్ చెప్పారు. రెండు నెలల క్రితం ఈ గేయం రిహార్సల్స్ ప్రారంభించి 75 మందిని సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ప్రాజెక్టును పూర్తిచేయగలిగారు. ఈ వీడియోను దేశంలోని 12 నగరాల్లో చిత్రీకరించారు. మనకు తెలిసిన చాలా మంది గాయనీగాయకులు, వాయిద్యకారులు ఈ వీడియో తయారీలో పాలుపంచుకుని ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవడంలో సహకరించారు.
రవీంద్రుడు అందించిన ‘జన గణ మన’ గేయంలోని ఆ 5 చరణాలు మనందరి కోసం…