Sharukh khan-Atlee Movie | తమిళ దర్శకుడు అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ‘రాజారాణి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా విజయ్తో ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘విజిల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో కోలీవుడ్లో అగ్ర దర్శకుల జాబితాలో నిలిచాడు. ప్రస్తుతం ఈయన షారుఖ్ ఖాన్తో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ముంబాయ్లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ చిత్రానికి ‘జవాన్’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంచినట్లు బాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇక ఈ చిత్ర టీజర్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు టాక్. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్గా నటించనుంది. బాలీవుడ్ భామ సాన్య మల్హోత్రా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనుంది. ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకి’ సినిమాను చేయబోతున్నాడు.