నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ సినిమా విడుదలైనపుడు వచ్చిన మిగిలిన సినిమాలు ఫ్లాప్ కావడంతో జాతి రత్నాలుకు కలిసొచ్చింది. 2021లో ఉప్పెన సినిమా తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ జాతి రత్నాలు. ఈ సినిమా 25 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..
25 రోజుల మొత్తం కలెక్షన్స్..
నైజాం: 15.96 కోట్లు
సీడెడ్: 4.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.95 కోట్లు
ఈస్ట్: 1.92 కోట్లు
వెస్ట్: 1.52 కోట్లు
గుంటూరు: 2.08 కోట్లు
కృష్ణా: 1.84 కోట్లు
నెల్లూరు: 0.91 కోట్లు
ఏపీ + తెలంగాణ 25 రోజుల మొత్తం: 32.45 కోట్లు (54 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.71 కోట్లు
ఓవర్సీస్: 4.25 కోట్లు
వరల్డ్ వైడ్ 25 డేస్ టోటల్: 38.76 కోట్లు షేర్ (68 కోట్ల గ్రాస్)