టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వెన్నునొప్పితో సౌతాఫ్రికా సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే టీ20 ప్రపంచకప్లో కూడా బుమ్రా ఆడటం అనుమానంగా మారింది. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ద్రావిడ్.. ప్రస్తుతం బుమ్రా ఎన్సీయేలో ఉన్నాడని, 2-3 రోజులు పరిశీలనలో ఉంచిన తర్వాత అతనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.
ఇప్పటివరకైతే అధికారికంగా ఎలాంటి విషయం తమకు అందలేదని, విషయం తెలియగానే మీడియాతో పంచుకుంటామని తెలిపాడు. ప్రస్తుతానికైతే కేవలం సఫారీ సిరీస్కు మాత్రమే బుమ్రా దూరమయ్యాడని, ప్రపంచకప్ నుంచి అధికారికంగా అతన్ని తొలగించే వరకు బుమ్రా పునరాగమనం విషయంలో ఆశాభావంతోనే ఉంటామని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్లో సిరీస్ తర్వాత వెన్నునొప్పితో జట్టుకు దూరమైన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో మళ్లీ జట్టుతో కలిశాడు.
ఆ మ్యాచ్లో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేసిన అతను.. మూడో మ్యాచ్లో నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. మళ్లీ సౌతాఫ్రికా సిరీస్ తొలి మ్యాచ్ సమయంలో వెన్నునొప్పి రావడంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సఫారీ టూర్ నుంచి అతన్ని తప్పించిన బీసీసీఐ.. బుమ్రా స్థానంలో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకుంది.
Jasprit Bumrah Is Not Ruled Out Yet!#CricketTwitter #RahulDravid #JaspritBumrah #IndianCricket #T20WorldCup2022 pic.twitter.com/14ryamqWI4
— CRICKETNMORE (@cricketnmore) October 1, 2022