అహ్మదాబాద్: ఆతిథ్య భారత్తో రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్(0)ను పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో బంతికే పెవిలియన్కు పంపాడు. దీంతో ఒక్క పరుగుకే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జేసన్ రాయ్(20), డేవిడ్ మలన్(18) ఆచితూచి ఆడుతున్నారు. పవర్ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.