అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయానికి జనసేన శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని పేర్కొన్నారు.
ప్రజాసమస్యలపై జనసేన పోరాడుతుందని, వైసీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆయన ఆక్షేపించారు.