నల్లగొండ : గత 40 ఏండ్లలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చేసేందేమీ లేదని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నాయర్ అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఆదివారం నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో పర్యటించారు. గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు.