హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు. ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు.. కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో, ఆర్యవైశ్య సంఘం లంగర్హౌస్లో ఆరు 6 జమ్మి చెట్లు నాటారు.
అట్లాగే రాజేంద్రనగర్ గంధంగూడ, తుల్జా భవాని రేణుక ఎల్లమ్మ ఆలయం, పిరంచెరువు ఆలయంలో ఆరు జమ్మి చెట్లు నాటినట్లు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మరో వినూత్న కార్యక్రమం చేపట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ముస్త్యాల శ్రీనివాస్, కంచర్ల వెంకటేశ్ గుప్తా, శ్రీనివాస్, రెడిశెట్టి కృష్ణమూర్తి, మేడ సత్యనారాయణ, కల్వకుంట విజయ లింగం, రాజేశ్, గోవిందు, ప్రవీణ్, లక్ష్మినారాయణ, బచ్చ సంతోష్, బాశెట్టి అశోక్, లక్ష్మణ్, గంధంగూడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ కటారి రాం నరేశ్, ch. రమేశ్గౌడ్, లంగర్ హౌస్ ప్రెసిడెంట్ విశ్వనాథుల సురేందర్, జనరల్ సెక్రటరీ విశ్వేశ్వరరావు, మహిళా విభాగం హైదరాబాద్ అధ్యక్షురాలు విశ్వ జ్యోతి, ఆర్యవైశ్య సంఘం బాబురావు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రేష్ఠి, బి. రాములునాయక్, నల్ల చంద్రారెడ్డి, రామస్వామి పాల్గొన్నారు.