హూస్టన్: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఓ చిన్నపాటి ఉల్కా ముక్క ఢీకొట్టింది. దీంతో ఆ టెలిస్కోప్ అద్దం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మే నెల చివరలో మైక్రోమెటిరాయిడ్ టెలిస్కోప్ను తాకినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా ముక్క ఢీకొనడం వల్ల స్వల్ప స్థాయిలో టెలిస్కోప్ పక్కకు జరిగిందని, అయితే అనుకున్న రీతిలోనే మిషన్ కొనసాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 2021 క్రిస్మస్ రోజున ఈ టెలిస్కోప్ను ప్రయోగించారు. గెలాక్సీలు, అంతరిక్షాన్ని స్టడీ చేసేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ప్రయోగించారు. భమి నుంచి 10 లక్షల మైళ్ల దూరంలో ఈ టెలిస్కోప్ ఉంది. ఈ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపేందుకు 10 బిలియన్ల డాలర్ల ఖర్చు అయ్యింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ కాలం ముగుస్తున్న నేపథ్యంలో జేమ్స్ వెబ్ను నాసా లాంచ్ చేసింది. జూలై 12వ తేదీన జేమ్స్ వెబ్కు చెందిన చిత్రాలను రిలీజ్ చేయనున్నారు. టెలిస్కోప్లోని సీ3 మిర్రర్ను ఉల్క తాకినట్లు తెలుస్తోంది. 6.5 మీటర్లు ఉన్న వెబ్ కెమెరాలో ఆ మిర్రర్ ఉంది.