శ్రీనగర్: జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ షాం సోఫీని భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని తిల్వాని మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లో సోఫీ హతమయ్యాడు.