Jaish-e Recce | నాగ్పూర్లోని ఆరెస్సెస్ హెడ్క్వార్టర్స్, హెగ్డేవార్ భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ సంస్థ ఈ రెండు చోట్ల ఇటీవల రెక్కీ నిర్వహించిందని నగర పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం జైషే మహ్మద్కు చెందిన కొందరు నాగ్పూర్కు వచ్చి ముఖ్యమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్, హెగ్డేవార్ భవన్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.
అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వడానికి అమితేశ్ కుమార్ నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని చెప్పారు. ఇతర పోలీసు వర్గాల కథనం ప్రకారం ఉగ్రవాదులు కొన్ని రోజుల క్రితం శ్రీనగర్ నుంచి నాగ్పూర్కు వచ్చారని, నెల రోజులు ఇక్కడే బస చేశారని సమాచారం. దీనిపై నాగ్పూర్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు టీమ్ను ఏర్పాటు చేసింది.