జైపూర్ : కళాశాలలో విద్యార్థులు హైడ్రామా సృష్టించారు. కళాశాలలో ఏటీఎం, ఓపెన్ ఎయిన్ జిమ్తో పాటు పలు వస్తువులు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వాటర్ ట్యాంకు ఎక్కారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుకున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మహారాణి కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు ఓవర్ హెడ్ ట్యాంకు ఎక్కారు. తమకు ఏటీఎంతో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా.. డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు దిగివచ్చినట్లు పోలీసులు తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) యోగేష్ గోయల్ మాట్లాడుతూ ముగ్గురు బాలికలు పలు డిమాండ్లతో ట్యాంక్ పైకి ఎక్కారని తెలిపారు. వారు దిగేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులను పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ముందు.. కళాశాల ఆవరణలో ఏటీఎం మిషన్లు, బ్యాంకులు, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, రాజస్థాన్ యూనివర్సిటీలో ఉన్న వాటర్ ట్యాంక్పైకి ముగ్గురు విద్యార్థి నేతలు ఎక్కారు. గత 48 గంటలుగా దానిపైనే ఉన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికల తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తేదీని పొడిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిరాకరించింది. ముగ్గురు విద్యార్థి నాయకులను ఒప్పించేందుకు సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఈ నెల 26న జరగనుండగా, 27న ఓట్ల లెక్కింపు జరగనుంది.