ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగుర వేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోష్యారి కోరారు. ఈ క్రమంలో ప్రస్తుతం జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అసెంబ్లీలో గురువారం జరిగే ఫ్లోర్ టెస్ట్కు హాజరై.. ఓటు వేసేందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వారి అభ్యర్థలను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించగా.. సాయంత్రం 5.30 గంటలకు విచారించనున్నది. ఇద్దరు ఎమ్మెల్యేలు మనీలాండింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నేరాలకు పాల్పడ్డారని, ప్రస్తుతం జైలులో ఉన్నారని న్యాయవాది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం 11 గంటలకు జరుగనున్న మహారాష్ట్ర శాసనసభ బలపరీక్షలో ఇద్దరు నేతలు పాల్గొనాలని ఉందని తెలిపారు.
మరో వైపు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించుకోవాలని గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ శివసేన చీఫ్విప్ సునీల్ ప్రభు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం కోర్టు విచారించనున్నది. గవర్నర్ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని విచారణ అత్యవసరమని సీనియర్ న్యాయవాది ఏఎం సంఘ్వీ వెంకేషన్ బెంచ్ పరిశీలించింది. ‘చట్టవిరుద్ధమైన బలపరీక్ష’పై స్టే కోసం పిటిషన్ను అత్యవసర విచారించాలని కోరారు.