జగిత్యాల రూరల్, ఏప్రిల్ 1: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 93 మందికి, అర్బన్ మండలానికి చెందిన 13 మందికి రూ.కోటీ 6లక్షల, 12వేలు విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 18 మందికి మంజూరైన రూ.5.32లక్షల విలువైన చెక్కులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో చీరెలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతు, కల్యాణలక్ష్మి పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్, జడ్పీటీసీ మహేశ్, సింగిల్ విండో చైర్మన్లు మైపాల్ రెడ్డి, సందీప్ రావు, పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, బాల ముకుందం, వైస్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సింగిల్ విండో వైస్ చైర్మన్ సురేందర్, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.