సూర్యాపేట : రోడ్డు పనుల్లో నాణ్యతాలోపంపై రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతాలోపంపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దురాజ్పల్లి-గరిడేపల్లి మధ్య రహదారి నిర్మాణాన్ని మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో పాటు పెన్పహాడ్ మండలంలోని దుపహాడ్ వద్ద నిర్మిస్తున్న మరో రహదారిని మంత్రి పరిశీలించారు. ఈ రోడ్డు వేసిన నెల రోజులకే చెడిపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. రహదారి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మంత్రి ఆర్ అండ్ బీ అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ పనులు చేస్తున్నప్పుడు అధికారులు ఎందుకు తనిఖీ చేయలేదన్నారు. 15 రోజుల్లో దుపహాడ్ రోడ్డును రిపేర్ చేయాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు.