అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమ ఉండడం వల్లే గడిచిన రెండున్నర ఏండ్లలో అనేక కార్యక్రమాలు అందజేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేక పోయినందుకు బాధగానే ఉందని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందని వెల్లడించారు.
కరోనా కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యం కోసం 30వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ఐఆర్తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ప్రకటించారని, అంగన్వాడీ ఉద్యోగులకు, సానిటేషన్, ఆశ వర్కర్లకు, హోంగార్డులకు అన్ని స్థాయిలో సానుభూతితోనే జీతాలు పెంచారని వివరించారు.
ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు సాగాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్కు సానుభూతి లేకపోతే ఇంత ఆలోచన ఎందుకు చేస్తాడో మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు. ప్రతిపక్షాలు గుంతకాడి నక్కల్లా ప్రభుత్వంపై విరుచుకు పడేందుకు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.