న్యూఢిల్లీ : సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మోహపాత్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్గా నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన ఆయన.. ప్రస్తుతం ఆదాయపు పన్ను విభాగానికి పాలసీని రూపొందించే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ (ACC) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్గా జేబీ మోహపాత్ర నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుతం సీబీడీటీ చైర్మన్గా పని చేసిన ప్రమోద్ చంద్ర మోడీ పదవీ కాలం గత మే 31న ముగియగా.. మూడు నెలలు పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగించింది. ఆయన 2019లో సీబీడీటీ చీఫ్గా నియామకమయ్యారు.