అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విధ్వంసక చర్యల వల్ల అనేక వ్యవస్థలు నాశనం అవుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్టార్టప్లో ఏపీ చివరి స్థానంలో నిలవడం బాధకరమని పేర్కొన్నారు. బిహార్తో పాటు ఏపీ చివరన ఉండడం దురదృష్టకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2018-19లో అంకురాల అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక స్టార్టప్లు విజయవంతంగా ఏర్పడ్డాయని వివరించారు.