Itlu Maredumilli Prajaneekam Intresting Update | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. అయితే గతేడాది ‘నాంది’తో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. గతే కొన్నేళ్ళుగా కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్న నరేష్ ‘నాంది’ చిత్రంతో తన పంథాను మార్చుకున్నాడు. కామెడీని పక్కన పెట్టి ‘నేను’ తర్వాత పూర్తి స్థాయి సీరియస్ రోల్ ఈ చిత్రంలో పోషించాడు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కాగా ఇప్పుడు మరో సీరియస్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం’. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమాలోని ‘లచ్చిమి’ అనే సాంగ్ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. నరేష్కు జోడీగా ‘శ్రీదేవీ సోడా సెంటర్’ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
A song about that beautiful #Lachchmi in everyone’s Life ❤️#ItluMaredumilliPrajaneekam
1st Single on OCT 4th 🎶#IMP #IMPonNov11th@allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore @SricharanPakala pic.twitter.com/qFFHRALgNX— Hasya Movies (@HasyaMovies) October 2, 2022