హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు ఔదార్యం ప్రదర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్ర శివారులో ఔటర్ బైపాస్ రోడ్డుపై, మెడికల్ కాలేజీకి సమీపంలో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టారు. దీంతో వారికి గాయాలయ్యాయి. బాధితులు జిల్లా కేంద్రం సిద్ధిపేట కాళ్లకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లింలు అని తేలింది.
ఈ సమయంలో అటువైపుగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతున్నది. జరిగిన ప్రమాదాన్ని చూడగానే కారు దిగారు. తన కాన్వాయ్లోని రెండు కార్లలో గాయపడిన ఆ ఇద్దరు క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానకు పంపారు. వారితోపాటు తన పీఏ మహేందర్రెడ్డి, ఎస్కార్ట్ పోలీసులను ఇచ్చి పంపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల దవాఖాన వైద్యులను ఆదేశించారు. ఆపదలో స్పందించి ఆదుకున్నందుకు క్షతగాత్రుల బంధువులు, అక్కడి వాహన చోదకులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..