న్యూఢిల్లీ: 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం మా కల అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని క్రీడా సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. భారత ఒలింపిక్ సంఘంతో పాటు కేంద్రానికి కూడా తమ నివేదన చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఢిల్లీ ప్రభుత్వం చొరవ తీసుకున్నదని, కానీ క్రీడా సంరంబం కోసం అందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. తమ కల నిజమవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.