న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: స్వతంత్ర మేధోసంస్థ సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్, చారిటీ ఆర్గనైజేషన్ ఆక్స్ఫామ్కు చెందిన కార్యాలయా ల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. అలాగే బెంగళూరు కేంద్రం గా పనిచేసే ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ (ఐపీఎస్ఎంఎఫ్) కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాలపై ఈ సంస్థల నుంచి ప్రకటన వెలువడలేదు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు అందుతున్న నిధులు, పన్ను ఎగవేతపై గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా తదితర రాష్ర్టాల్లో దాదాపు 110 ప్రాంతాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందు కు అనుబంధంగానే స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు జరిపినట్టు సమాచారం.
కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే!
పరిశోధనాత్మక కథనాలు అందించే మీడియా సంస్థలకు నిధులను సమకూర్చే సంస్థగా ఐపీఎస్ఎంఎఫ్కు పేరున్నది. ది కారవాన్, ప్రింట్, స్వరాజ్య సంస్థలకు నిధులు ఇస్తున్నది. జర్నలిస్ట్ టీఎస్ దీని చైర్మన్. సీపీఆర్ కూడా కేంద్ర విధానాలను తరచూ ప్రశ్నిస్తున్నది. ఒకప్పుడు ఈ సంస్థ విద్యావేత్త ప్రతాప్ భాను మెహతా ఆధ్వర్యంలో నడిచింది.