శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్డౌన్ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్ నింగిలో లక్ష్యందిశగా వెళ్తున్నది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తున్నది. ఇస్రో ఈ ఏడాదిలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r
— ANI (@ANI) February 14, 2022
పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ 1710 కిలోల ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్–04, 17.50 కిలోల ఐఎన్ఎస్-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్స్పైర్శాట్-1, ఉపగ్రహాలను మోసుకెళ్తున్నది. ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు. ఐఎన్ఎస్-2డీ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించాయి. దీనిని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం రూపొందించారు.