గాజా : పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజుల కాక ముందే ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది. దక్షిణ ఇజ్రాయెల్లోకి పాలస్తీనియన్లు పేలుడు బెలూన్లు వదిలారని ఆరోపించింది. ఈ మేరకు వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హమాస్ కాంపౌండ్లో దాడి చేశామని, రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. గాజా నగరం, సిటీ ఆఫ్ ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్ మీడియా సంస్థ పేర్కొంది.
గత నెలలో 11 రోజుల పాటు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాకెట్ దాడులు చేసుకున్నాయి. ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకారం.. ఇందులో 66 మంది పిల్లలతో సహా 253 మంది పాలస్తీనియన్లు మరణించగా.. ఇజ్రాయెల్లో ఓ సైనికుడు సహా బాలుడు మరణించాడు. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో ఇజ్రాయెల్- గాజాల మధ్య మే 21న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మరోసారి యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..