నల్లగొండ : ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 24 గంటలు నడిచే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో సరిపడా అక్షిజన్ సరఫరా చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్-19పై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 24 గంటలు నడిచే 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించామన్నారు.
అందులో చండూరు, చిట్యాల, కనగల్, కేతేపల్లి, మునుగోడు, శాలిగౌరారం, తిప్పర్తి, దామరచర్ల, హాలియా, నిడమనూర్, పెద్దవూర, వేములపల్లిలతో పాటు డిండి, గుడిపల్లి, గుర్రంపోడు, కొండ మల్లెపల్లి , మర్రిగూడ, నాంపల్లి, పీఏ పల్లి తదితర మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఇక పై కొవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వ దవాఖానలకు మంజూరు ఆయిన రెమిడెసివర్ ఇంజక్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ ఇండెంట్ పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు ఆయన సూచించారు.
జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉన్న అన్ని వెంటిలేటర్లు పనిచేసే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ పేషంట్లకు ధైర్యమే మందు అని, ఆ ధైర్యమే వైద్యులు, వైద్యశాఖ సిబ్బంది పేషేంట్లకు అందించాలని ఆయన కోరారు.
ఇప్పటివరకు జిల్లాలో 4 లక్షల 50 వేల 895 శాంపిల్స్ సేకరించగా 40,696 మందికి పాజిటివ్ సోకినట్లుగా ఆయన వివరించారు. అందులో 10,290 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 703 మంది ఆయా దవాఖానలో చికిత్సలు పొందుతున్నారన్నారు.
ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 72.64 శాతం రికవరీ ఉందని 29, 560 మంది పూర్తిగా కొలుకున్నారన్నారు. మొత్తం పాపులేషన్ లో 25.87 శాతం టెస్ట్ లు చేయగా 9.03 శాతం పాజిటివ్ గా నమోదు అవుతున్నారన్నారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్