హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఖేలో ఇండియా కింద వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధులు ఇందుకు నిదర్శనమని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయించిన కేంద్రం.. బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం మొక్కుబడిగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా నిధుల్లో గుజరాత్కు రూ. 608 కోట్లు, తెలంగాణకు కేవలం రూ. 24 కోట్లు కేటాయించడం ఏ విధంగా సమాఖ్య స్ఫూర్తి అని నాగేశ్వర్రావు ప్రశ్నించారు.