వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న సన్రైజర్స్ కు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. చివర్లో హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడినా గెలుపు తీరానికి మాత్రం చేర్చలేకపోయాడు. 20 ఓవర్లలో 120 పరుగులే చేసి 5 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది.
అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. పంజాబ్ బ్యాటర్లను 125కే కట్టడి చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు తీసుకున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినా లక్ష్యాన్ని ఛేదించలేక సన్రైజర్స్ చేతులెత్తేసింది. వార్నర్, విలియమ్సన్ ఆదిలోనే అవుట్ కావటం భారీ దెబ్బ పడింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు తీశారు.