IPL Mega Auction | త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2022) కోసం ఆటగాళ్ల మెగా వేలం తొలిరోజు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. చివరి క్షణంలో పది మంది పేర్లు నమోదు చేసుకోవడంతో మొత్తం 600 మంది వేలంలో పాల్గొన్నారు. పది ఫ్రాంచైసీలకు 217 మంది ప్లేయర్లు అవసరం. తొలిరోజు వేలంలో ఇషాన్ కిషాన్ మెరిశాడు. రూ.15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దీంతో తొలి రోజు వేలంలో అత్యధిక ధరకు ముంబై ఇండియన్స్ చేజిక్కించుకున్న ప్లేయర్గా ఇషాన్ కిషాన్ నిలిచాడు.
తర్వాతీ స్థానంలో దీపక్ చాహర్ను రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రేయాస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రోజు వేలంలో తొలుత పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైసీ.. శిఖార్ థావన్ను రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్ తెత్వాయాను గుజరాత్ టైటాన్స్ రూ.9 కోట్లకు గెలుచుకుంది. కనీస ధర రూ.20 లక్షలతో మొదలైన అవేశ్ ఖాన్ వేలం రూ.10 కోట్లకు దూసుకెళ్లింది. నూతన ఫ్రాంచైసీ లక్నో సూపర్ జెయింట్స్ ఆయన్ను సొంతం చేసుకుంది. వివిధ ఫ్రాంచైసీలు తొలిరోజు 74 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు- రూ. 39.75 కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ.48 కోట్లు
పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ – రూ.54.5 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 68 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- రూ.41.6 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.41.25 కోట్లు
కోల్కతా నైట్ రైడర్స్ – రూ.20.25 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ – రూ.32.75 కోట్లు
గుజరాత్ టైటాన్స్ – రూ.45.75 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ రూ.35.75కోట్లు