iPhone SE 3 | యాపిల్ సంస్థ త్వరలో ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్ ఫోన్ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్కు ఇది అప్డేటెడ్ ఫోన్. 5జీ కెపాసిటీతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్ను త్వరలో జరగబోయే యాపిల్ ఈవెంట్లో లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. మార్చి 8న యాపిల్ ఈవెంట్ జరగనుంది.
యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ ఎస్ఈ3 తో పాటు కొత్త ఐపాడ్ను కూడా లాంచ్ చేసేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ3ని 5జీ నెట్వర్క్తో పాటు బెస్ట్ కెమెరా ఫీచర్లు, వేగవంతమైన ప్రాసెసర్తో లాంచ్ చేయనుంది.
ఐఫోన్ ఎస్ఈ 3ని కేవలం 300 డాలర్లకే అందించేందుకు యాపిల్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. 300 డాలర్లు అంటే మన కరెన్సీలో కేవలం రూ.22,500. ఐఫోన్లలోనే ఇది చాలా చవకైన ఫోన్గా చరిత్రకెక్కనుంది. ఐపాడ్ ధర 500 డాలర్లు(రూ.37,400) నుంచి 700 డాలర్లలోపు(రూ.52400) వరకు ఉండనుంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, 3 జీబీ ర్యామ్, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ3 రానుంది.