హైదరాబాద్ : తెలుగుభాగవత ప్రచార సమితి నిర్వహిస్తున్న అన్నమయ్య శతగళార్చన (2021)లో పాల్గొనేందుకు గాయనీగాయకుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అంతర్జాల అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొని భగవదాశీస్సులు పొందాలని వారు సూచించారు.
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పిల్లలు, పెద్దలు ఎవరైనా పాల్గొనవచ్చు. అన్నమయ్య కీర్తనలు పాడే ఆసక్తి ఉంటే చాలు. అన్నమయ్య కీర్తనలతో అంతర్జాతీయవేదికపై అందరినీ అలరించేందుకు వెంటనే నమోదు చేసుకోండని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కీర్తనలు పంపేందుకు గడువు ఏప్రిల్ 24, ప్రత్యక్షప్రసారం మే26 ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కింది వెబ్సైట్ను పరిశీలించాలని నిర్వాహకులు తెలిపారు.