అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆహ్వానం పంపగా పీఆర్సీ సాధన సమితి నేతలు తిరస్కరించారు.
పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని శశిభూషణ్కు ఫోన్లో నిర్ణయం తెలిపారు. ఈరోజు డిమాండ్ల సాధనకు సీఎస్కు సమ్మె నోటీసును సాధన సమితి నాయకులు అందజేయనున్నారు.