బతుకమ్మ ఆటలు.. బోనాలతో ర్యాలీలు.. ఆటల పోటీలు.. సంక్షేమ పథకాలపై ప్ల్లకార్డుల ప్రదర్శనలతో ‘కేసీఆర్ మహిళా బంధు సంబురాలు’ అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సోమవారం వేడుకలు హోరెత్తాయి. ఊరూరా మహిళలు, టీఆర్ఎస్ శ్రేణులు కలిసి సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. పాలాభిషేకం చేసి నీరాజనం పలుకగా, ఇటు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బాజాభజంత్రీలు, సన్నాయి వాయిద్యాలతో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించి సెల్ఫీలు దిగారు. బొట్టు పెట్టి.. చీర, సారెను కానుకగా అందించగా, కుటుంబాలు ఎంతో మురిసిపోయాయి.
కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఉమెన్స్ డేను పురస్కరించుకొని టీఆర్ఎస్ పిలుపు మేరకు ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రెండో రోజు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోరెత్తాయి.
హోరెత్తిన సంబురాలు తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి, సెల్ఫీలు దిగారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో మేయర్ వై సునీల్రావు లబ్ధిదారులకు చీరెలు పంపిణీ చేశారు. అలాగే 27వ డివిజన్లో సీఎం కేసీఆర్ భారీ కటౌట్కు స్థానిక మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. నగరంలో పలు కార్యక్రమాల్లో కార్పొరేటర్లతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. జమ్మికుంటలో మెప్మా ఆధ్వర్యంలో కేసీఆర్ కటౌట్కు మహిళలు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం చిగురుమామిడి మండ లం చిన్న ముల్కనూర్లో పారిశుధ్య కార్మికులు, ఐకేపీ సీఏలను సుడా చైర్మన్ జీవీ రా మకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు సన్మానించారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు బిగ్ హర్ట్ ఫౌండేషన్ చైర్మన్ జమున రూ.2 లక్షల విలువైన నీటి శుద్ధి యంత్రం, పిల్లల, ఆట వస్తువులను కానుకగా అందించారు.