హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో గాంధీ సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ప్రదర్శిస్తున్న గాంధీ చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులతో సీఎస్ మాట్లాడారు. గాంధీ సినిమా ఇదివరకు చూసారా, ప్రస్తుతం చూస్తుంటే ఎలా అనిపించింది? అని విద్యార్థులను ప్రశ్నించారు.
ఇప్పటివరకు తాము గాంధీ సినిమా చూడలేదని, ఈ సినిమా చూడటం ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడిందని విద్యార్థులు సీఎస్కు తెలిపారు. సినిమా చూడటం వల్ల ఏర్పడ్డ భావాలను, తమలో వచ్చిన మార్పుల గురించి సవివరమైన వ్యాసాన్ని రాయాలని సోమేశ్కుమార్ విద్యార్థులకు సూచించారు. గాంధీ సినిమాను తెలంగాణలో 552 సినిమా హాళ్లలో 22 లక్షలకు పైగా సూల్ విద్యార్థులు వీక్షిస్తున్నారని తెలిపారు.
అవసరమైతే మరికొన్ని రోజులు ఈ సినిమా ప్రదర్శనను పొడిగిస్తామన్నారు. ఈ సినిమాను ప్రతి ఒక విద్యార్థి చూసి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని పొందాలనేది సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. కార్యక్రమంలో సీఎస్తోపాటు మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లో జీహెచ్ఎంసీ కొత్తగా రూపొందించిన ఫ్రీడమ్ పార్ లో బుధవారం సీఎస్ మొకలు నాటారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లో కేశ్కుమార్ మొకలు నాటారు. ప్రధాన రహదారి సమీపంలో ఐదెకరాల స్థలంలో అద్భుతమైన పార్ ఏర్పాటుచేయడం పట్ల అధికారులను సోమేశ్కుమార్ అభినందించారు.