న్యూఢిల్లీ: ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డార్టీ పాచికో ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలను ఉద్దేశించి ప్రసగించారు. పోర్చుగల్, భారత్ మద్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. రెండు దేశాల మధ్య 500 ఏళ్ల నాటి బంధం ఉందని, ఒకరికి ఒకరు బాగా తెలుసు అని, కేవలం మిత్ర దేశాలు మాత్రమే కాదు అని, మనం సోదరుల్లా ఉన్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ది అని పాచికో అన్నారు. అన్ని స్థాయిల్లోనూ.. స్థానిక నుంచి జాతీయం వరకు.. మహిళలు, యువకులతో దేశం సమగ్రంగా కనిపిస్తోందని డార్టీ ప్రశంసించారు. ప్రతి ఒక్కరి రాజకీయ, మతపరమైన భావాలకు భారత్ గౌరవం ఇస్తుందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే సంస్కరణలకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని, యూఎన్లో భద్రతా మండలిలో భారత్ను శాశ్వత సభ్యదేశంగా మార్చేందుకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని డార్టీ తెలిపారు.
ప్రపచంలో భారత్ది అతి పెద్ద ప్రజాస్వామ్యం అని, దేశంలో 130 కోట్ల మంది పౌరులు ఉన్నారని, గత 74 ఏళ్లలో.. భాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడిందని, ఇప్పుడు మేం 75వ స్వాతంత్య్ర సంబరాలు నిర్వహించుకుంటున్నామని, పార్లమెంట్లో సెంట్రల్ హాల్ దీనికి సాక్ష్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఐపీయూ అధ్యక్షుడిగా మీరు.. అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతలు స్వీకరించారని, స్పానిష్ ఫ్లూ తర్వాత కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడిందని, దీని వల్ల అన్ని దేశాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ప్రభావం పడనున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తెలిపారు.
ప్రధాని మోదీతో ఐపీయూ అధ్యక్షుడు డార్టీ పాచికో భేటీ అయ్యారు. సెంట్రల్ హాల్లో వాళ్లు కలుసుకున్నారు. 1889లో ఐపీయూ ఏర్పడింది. దీంతో 179 సభ్య దేశాలు ఉన్నాయి.