సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ): టోయోటా కిర్లోస్కర్ మోటార్స్ క్యామ్ రీ హైబ్రిడ్ మోడల్ కారు కొత్త వెర్షన్ను సోమవారం ఆవిష్కరించింది. నగరంలోని రాధాకృష్ణ టొయోటా, యశోద కృష్ణ టొయోటా షోరూమ్లలో సంస్థల సీఓఓ రంగస్వామి కొత్త మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. అత్యాధునిక ఫీచర్లతో పాటు ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ కారు లగ్జరీ కేటగిరికి చెందింది. ఫ్రంట్ బంపర్, గ్రిల్ డిజైన్లతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా దీనిని కంపెనీ రూపొందించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.41.7లక్షలుగా ఉంది. కార్యక్రమంలో రాధా గ్రూపు వైస్ ప్రెసిడెంట్ అనిల్ జక్కన్న, జీఎం సేల్స్ ఈశ్వర్లు పాల్గొన్నారు.