మోండొరా (ముప్కాల్): ఎగువ ప్రాంతంల నుంచి శ్రీరాంసాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4 వేల 575 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు).
కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1091 అడుగుల నీటిమట్టం (90.313 టీఎంసీల) ఉంది. దీంతో నిండుకుండలా మారింది ప్రాజెక్టు. కాల్వల ద్వారా జెన్కోకు 7500 కూసెక్కులు, లక్ష్మి కాలువకు 180 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 135 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతలకు 540 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.