వరంగల్ అర్బన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలాలు అనుభవంలోకి వస్తున్నాయి. అందువల్లే మన రాష్ట్రంలో విష జ్వరాలు, అంటూ వ్యాధులు బాగా తగ్గాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పల్లె ప్రగతి వల్ల అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి.
గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలు అనేవారు. ఇప్పుడు మున్సిపాలిటిలు అభివృద్ధికి మారు పేరుగా తయారు అవుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో మంత్రి పర్యటించారు. పల్లె ప్రగతితో అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలిపారు.
గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలు అనేవారు. ఇప్పుడు మున్సిపాలిటీలు అభివృద్ధికి మారు పేరుగా తయారు అవుతున్నాయని పేర్కొన్నారు. ఏటా రూ.250 కోట్లు ఇస్తూ వరంగల్ నగరాన్ని సీఎం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు. బీసీ మహిళకు వరంగల్ మేయర్ గా గొప్ప అవకాశం కల్పించారు.
అందుకు సీఎం కు ధన్యవాదాలన్నారు. అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఇతర నేతలు, అధికారులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.