ఇందూరు, అక్టోబర్ 2 : ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా కలెక్టర్ నారాయణరెడ్డి అవార్డులను స్వీకరించారు.
కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు దక్కింది. జిల్లాల కేటగిరీలో నిజామాబాద్ మూడోస్థానం, సౌత్ రీజియన్ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, స్వచ్ఛభారత్ కో-ఆర్డినేటర్ నరేశ్ ఉన్నారు.