అమరావతి : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో చీరల మాయం విషయంలో రికార్డు అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం సస్పెన్షన్కు గురయ్యారు. చీరల ఇండెంట్లు సమర్పించలేదని ఆలయ ఈవో భ్రమరాంబ అతడిని సస్పెండ్ చేశారు. 2019-20లో భక్తులు సమర్పించిన 77 చీరలు మాయమైనట్లు గుర్తించిన అధికారులు విచారణ జరిపారు.
చీరల విలువ రూ. 7లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా సుబ్రహ్మణ్యం గతంలోనూ చీరల మాయం విషయంలో ఆరు నెలల పాటు సస్పెన్షన్కు గురయ్యారు. తాజా చీరల గల్లంతులోనూ నిర్లక్ష్యం వహించినందుకుగాను మరోసారి అతడిపై ఆరునెలల పాటు వేటు వేశారు.