ముంబై : బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.20లక్షలు మోసం చేశారనే ఫిర్యాదు మేరకు ఇండర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. రాజ్పాల్ యాదవ్ తన కుమారుడిని సినీ పరిశ్రమలో ప్రోత్సాహం అందిస్తానని రూ.20 లక్షలు తీసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, ఇప్పటి వరకు నటుడు తన కుమారుడికి ఎలాంటి సహకారం అందించలేదని, అదే సమయంలో డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫోన్ చేసినా స్పందించడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదంటూ బాధితుడు తుకోగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 15 రోజుల్లో తమ ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీచేశారు. గతవారం సురిందర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ లాలన్ మిశ్రా తెలిపారు.