న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికుల సౌకర్యార్థం మరో సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ‘డోర్ టు డోర్ బ్యాగేజ్ ట్రాన్స్ఫర్’ సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసుతో ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు గానీ, విమానాశ్రయం నుంచి ఇంటికి తమ లగేజీని మోసుకెళ్లే బాధ తప్పుతుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్లలో ఈ సేవలను మొదలుపెట్టింది. త్వరలోనే ముంబై, బెంగళూరు నగరాల్లోనూ అందుబాటులోకి తేనున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇందుకోసం ఇండిగోతో ప్రముఖ ఆన్లైన్ లాజిస్టిక్ సేవల సంస్థ కార్టర్పోర్టర్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ‘6ఈ బ్యాగ్పోర్ట్’ పేరుతో ఇండిగో ఈ సేవలను ప్రారంభించింది. 6ఈ బ్యాగ్పోర్ట్ సేవల ద్వారా ప్రయాణికుల బ్యాగేజీ.. లగేజీని భద్రంగా వారికి గమ్యస్థానానికి చేరుస్తామని ఎయిర్లైన్ తెలిపింది.
6ఈ బ్యాగ్పోర్ట్ సర్వీస్లో ప్రయాణికులు తమ లగేజీ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రయాణికులు విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు నుంచి, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఇండిగో తెలిపింది.
ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఎయిర్పోర్టు వరకు లేదా విమానాశ్రయం నుంచి ఇంటికి లగేజీని పంపించుకోవచ్చు. ఒకసారి లగేజీ ట్రాన్స్ పర్ చేస్తే రూ. 630 చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక, బ్యాగేజీకి రూ. 5000 చొప్పున సర్వీసు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం