Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ గాడి తప్పింది. జూలైలో 6.71 శాతంతో సగటు భారతీయుడికి కాసింత రిలీఫ్ ఇచ్చిన చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టులో తిరిగి కొండెక్కింది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు శాతానికి చేరుకుంది. ఆహార వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం అని సోమవారం ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. వినియోగదారుడి ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ సౌలభ్య స్థాయిని దాటేసి.. ఆరు శాతానికి పైగా నమోదు కావడం వరుసగా ఎనిమిదో నెల కావడం గమనార్హం.
ఆహార వస్తువుల ధరలు గత నెలలో 7.62 శాతం పెరిగాయి. జూలైలో 6.69 శాతం కాగా, గతేడాది ఆగస్టులో 3.11 శాతానికి చేరింది. హీట్ వేవ్ పెరిగిపోవడంతో గోధుమలు, బియ్యం, పన్ను ధాన్యాల ధరలు ఎక్కువై భారతీయుల గృహ బడ్జెట్పై భారం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో 50 శాతం ఆహార ధాన్యాల, వస్తువుల ధరలు కీలకం అవుతాయి.
మరోవైపు భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ జూలైలో 2.4 శాతం పెరిగింది. 2021 జూలైలో ఇది 11.5 శాతం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) రిలీజ్ చేసిన డేటా ప్రకారం జూలైలో ఐఐపీ వృద్ధిరేటు 3.2 శాతానికి చేరింది. మైనింగ్ ఉత్పత్తి 3.3 శాతం పడిపోగా, విద్యుత్ ఉత్పత్తి 2.3 శాతం పెరిగింది. కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో 2020 ఏప్రిల్లో ఐఐపీ 57.3 శాతం పడిపోయింది.