న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,640 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది. గడిచిన 91 రోజుల్లో అత్యల్ప స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 81,839 మంది డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 1167 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇండియాలో ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 28.87 కోట్లకు చేరుకున్నది. సోమవారం రోజున దేశవ్యాప్తంగా 53వేల పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,89,302కు చేరింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు 2.56 శాతానికి చేరుకున్నది. అయితే వరుసగా 15వ రోజు.. ఇండియాలో పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్నది. మహారాష్ట్రలో సోమవారం 6270 కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 59.79 లక్షలకు చేరుకున్నది.