డెహ్రాడూన్ : భారతదేశపు మొదటి అటవీ వైద్యం కేంద్రం ఉత్తరాఖండ్ రాణిఖేట్లోని కలికాలో ఆదివారం ప్రారంభమైంది. దీన్ని జపనీస్ అటవీ స్నానం అదేవిధంగా పురాతన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొంది రూపొందించారు. అటవీ నడక, ధ్యానం, చెట్లను కౌగిలించుకోవడం, ఆకాశాన్ని తదేకంగా చూడటం, నెమ్మదిగా వెళ్లడం, నిశ్చబ్దంగా ఉండటం, తక్కువగా ఆలోచించడం, ఎక్కువగా అనుభూతి చెందడం వంటి కార్యకలాపాలను కలిగి ఉంటుందని అటవీ చీఫ్ కన్జర్వేటర్ సంజీవ్ చతుర్వేది తెలిపారు. మొత్తం 13 ఎకరాల్లో ఇది విస్తరించి ఉన్నట్లు తెలిపారు.